రాష్ట్రపతి నుంచి భారతరత్న అవార్డు అందుకున్న పీ.వీ నరసింహరావు కుమారుడు ప్రభాకర్ రావు
అమరావతి: దేశంలో పలు రంగాల్లో విశేష కృషి చేసిన భారత మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు,, చౌదరి చరణ్ సింగ్,, బీజేపీ సీనియర్ నాయకులు ఎల్కే అద్వానీ,, బీహార్ మాసీ సీఎం కర్పూరీ ఠాకూర్,, హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్కు భారతరత్న ప్రకటించిన విషయం విదితమే..భారతరత్న ప్రకటించిన వారి వారసులు శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు..ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో భారతరత్న అవార్డుల ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది.. పీవీ నరసింహారావు తరపున ఆయన కుమారుడు ప్రభాకర్ రావు,, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు..చరణ్సింగ్ తరపున ఆయన మనువడు జయంత్ సింగ్,, స్వామినాథన్ తరపున ఆయన కుమార్తె నిత్యా రావు,, కర్పూరీ ఠాకూర్ తరపున ఆయన కుమారుడు రామ్నాథ్ ఠాకూర్ భారతరత్న అందుకున్నారు..ఆదివారం రాష్ట్రపతి,, ప్రధాని మోదీ ఎల్కే అద్వానీ ఇంటికి వెళ్లి భారతరత్న అవార్డు ప్రదానం చేయనున్నారు.