శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నగవర్నర్ అబ్దుల్ నజీర్
తిరుమల: రెండు రోజుల తిరుమల,తిరుపతి పర్యటనలో భాగంగా శుక్రవారం రాత్రి తిరుమల శ్రీపద్మావతి అతిథి గృహం చేరుకున్న రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కి టిటిడి ఈ.ఓ ఏ.వి.ధర్మారెడ్డి స్వాగతం పలికారు..గవర్నర్ వెంట ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, జిల్లా కలెక్టర్ వెంకట రమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తదితర అధికారులు ఉన్నారు. గవర్నర్ తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహంలో రాత్రి బస చేసి శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.