AMARAVATHINATIONAL

మాగుంట రాఘవరెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ హైకోర్టు

అమరావతి: ఢిల్లీ మధ్యం కుంభకోణంలో ఒంగొలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డికి,, ఢిల్లీ హైకోర్టు వెకేషన్ బెంచ్ జస్టిస్ చంద్రదరియాసింగ్ బుధవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు..లిక్కర్  కేసులో నిందితుడిగా ఉన్న మాగుంట రాఘవరెడ్డిని ఫిబ్రవరి 11న ఈడీ అరెస్ట్ చేసింది..తన అమ్మమ్మ అనారోగ్యంతో ఆస్పత్రిలో  ఉందని,,6 వారాల పాటు బెయిల్ ఇవ్వాలని పిటీషన్ దాఖలు చేయగా కోర్టు రెండు వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది..విచారణ సందర్బంగా రాఘవరెడ్డి బెయిల్ పిటిషన్ కు వ్యతిరేకంగా ఈడీ వాదనలు విన్పిస్తు,,83 ఏళ్ల రాఘవరెడ్డి, అమ్మమ్మ బాత్రూమ్ లో జారిపడి గాయపడ్డారని,,ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపింది.. ఆమె బాగోగులు చూసుకునేందుకు చాలా మంది ఉన్నారన్న,,ICUలో ఉండగా రోగిని చూడడం కుదరదని వాదించింది.. మనీ లాండరింగ్ చట్టంలో సెక్షన్ 45 ప్రకారం ఇలాంటి కారణాలతో బెయిల్ మంజూరు చేయొద్దని కోర్టును కోరింది..కేసులో నిందితులందరు తమ బంధువులు బాత్రూంలో పడి గాయపడుతున్నారంటూ బెయిల్ పిటిషన్ దరఖాస్తు చేస్తున్నారని తెలిపింది..ఈడీ వాదనలు పరిగణలోకి తీసుకోకుండా ఢిల్లీ హైకోర్టు,,షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *