బీజాపూర్ జిల్లా పరిధిలో భారీ ఎన్ కౌంటర్-ఆరుగురు మావోయిస్టులు మృతి
అమరావతి: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో బుధవారం వేకువజామున భారీ ఎన్కౌంటర్ జరిగింది.. బాసగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని చీపురుబట్టి అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతాబలగాలకు,, మావోయిస్టులు తారసపడ్డారు.. దాంతో భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు.. మృతుల్లో దళం డిప్యూటీ కమాండర్తోపాటు ఇద్దరు మహిళ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.. బస్తార్ ప్రాంతంలో ఏప్రిల్ 19న మొదటి విడత లోకసభ ఎన్నికలు జరగనున్నాయి..ఈ కూబింగ్ అపరేషన్ లో,, పాల్గొన్న కోబ్రా (కంమోడోస్),, CRPF బెటాలియన్, DRG భద్రతాబలగాలు, మావోయిస్టల మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. మరణించిన నక్సలైట్ల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.. సంఘటనా స్థలంలో ఉన్న ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్, కోబ్రా, CRPF అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. హోలీ రోజున నక్సలైట్లు ఈ ప్రాంతంలో ముగ్గురు గ్రామస్థులను దారుణంగా చంపారు.