AMARAVATHINATIONAL

దేశ సరిహద్దుల వద్ద రంగంలోకి హెరాన్ మార్క్ 2 డ్రోన్లు

అమరావతి: దేశ సరిహద్దుల్లో మిగ్-29 స్క్వాడ్రన్ ను మోహరించిన కేంద్ర ప్రభుత్వం,, చైనా, పాకిస్తాన్ లు ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పపడేందుకు ప్రయత్నించిన వెంటనే పసికట్టేందుకు సరిహద్దుల వద్ద అధునాతన డ్రోన్లను మోహరించింది..ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పర్యవేక్షణలో హెరాన్ మార్క్ 2 డ్రోన్ లను మోహరించారు.. “వార్డెన్ ఆఫ్ నార్తన్ స్క్వాడ్రాన్” కింద ఈ డ్రోన్లను ఆపరేట్ చేస్తున్నారు… హెరాన్ మార్క్ 2 డ్రోన్ లకు శాటిలైట్లతో లింక్ ను ఏర్పడి వుంటుంది..మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల్లో కూడా సులభంగా ఈ డ్రోన్లను ఆపరేట్ చేయవచ్చు..ఇజ్రాయెల్ ఎయిరోస్పేస్ ఇండస్ట్రీస్ తయారు చేసిన ఈ డ్రోన్లను 35 వేల అడుగులో ఎగురుతూ 150 నాట్ల వేగంతో ప్రయాణం చేస్తాయి.. ప్రాజెక్ట్ చీతా కింద డ్రోన్ల తయారీకి ప్రాధాన్యత ఇస్తోన్న కేంద్రం,,ఆత్మనిర్భర్ భారత్ లో బాగంగా ఇలాంటి డ్రోన్ల తయారీకి చర్యలు చేపట్టింది..ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా 97 డ్రోన్లను భారత్ దిగుమతి చేసుకుంటోంది..చైనాలు డ్రోన్ల టెక్నాలజీలో ముందుండగా,, టర్కీ సాయంతో పాకిస్తాన్ చాలా డ్రోన్లను సేకరించింది..వీరిని కౌంటర్ చేసేందుకు భారత్, ఇజ్రాయెల్ సహకారంతో హెరాన్ మార్క్ 2 డ్రోన్లను రంగంలోకి దింపింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *