DISTRICTS

జ్యోతిరావ్ పూలే ఆశయాలను ముందు తరాలకు అందించాలి-ఇంచార్జీ జిల్లా కలెక్టర్

నెల్లూరు: సమసమాజ స్థాపనకు కారణభూతులైన మహాత్మా జ్యోతిరావ్ పూలే లాంటి మహనీయుల అడుగు జాడల్లో నడుచుకుంటూ వారి ఆశయాలను ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఇంచార్జీ జిల్లా కలెక్టర్ ఆర్.కూర్మనాథ్ పేర్కొన్నారు..మహాత్మ జ్యోతిబా పూలే 197వ జయంతి సందర్భంగా మంగళవారం కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో  ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిబా పూలే చిత్ర పటానికి ఇంచార్జీ జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు..ఈ సందర్భంగా ఇంచార్జీ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎందరో మహనీయుల కృషి ఫలితంగా స్వాతంత్ర్యం వచ్చిందని, ఆనాడు సమాజంలో అనేక రుగ్మతలు, దురాచారాలు నెలకొన్న పరిస్థితులలో  వాటిని రూపుమాపేందుకు మహాత్మా జ్యోతి బా ఫూలే, డా.బి.ఆర్.అంబేడ్కర్ వంటి మహనీయుల కృషీతో సమసమాజ  స్థాపన జరిగి నేడు సమాజంలో మార్పు రావడం జరిగిందన్నారు. విద్యతోనే సమన్యాయం, అభివృద్ధి సాధ్యమని నమ్మిన మహాత్ముడు జ్యోతిబా పూలే అని పేర్కొన్నారు..ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు,వివిధ బిసి సంఘాల నాయకులు, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *