AMARAVATHINATIONAL

నేటి నుంచి మణిపూర్ మొబైల్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి-సీ.ఎం బీరెన్

అమరావతి: ఈశాన్య భారతదేశంలో రెండు జాతుల మధ్య ఘర్షణలు చెలరేగడంతో మణిపూర్ రాష్ట్రంలో మే నెల 3వ తేదిన నిలిపివేసిన మొబైల్ ఇంటర్నెట్ సేవలను తిరిగి శనివారం నుంచి తిరిగతి ప్రారంభిస్తున్నమని మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ తెలిపారు..శనివారం అయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విద్వేషపూరిత ప్రసంగాలు,,ఆసత్యవార్తల వ్యాప్తిని నిరోధించడానికి మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిందని,,అయితే ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి మెరుగుపడిందన్నారు..

భారత్-మయన్మార్ సరిహద్దుకు ఇరువైపుల నివసించే ప్రజలు ఎటువంటి పత్రాలు లేకుండా ఒకరి భూభాగంలోకి మరోకరు వెళ్లేందుకు  అనుమతించడాన్ని నిషేధించాలని ఆయన పిలుపునిచ్చారు..అలాగే భారత్-మయన్మార్ సరిహద్దుల్లో కంచె ఏర్పాటు చేయాల్సిన అవసరం వుందన్నారు..

రాష్ట్ర సరిహద్దుల్లో 60 కిలోమీటర్ల మేర కంచే వేయడానికి కేంద్ర హోంశాఖ హోం మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి వెల్లడించారు..గత ప్రభుత్వాలు తీసుకున్న అనాలోచిత చర్యల వల్లే ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు..తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రానికి ఎలాంటి నష్టం జరగలేదని,,శాంతిభద్రతలు మెరుగుపడుతున్నయని తెలిపారు.

 

 

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *