సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మెగాస్టార్ చిరంజీవి
హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి మర్యాదపూర్వకంగా కలిశారు. జూబిలీహిల్స్ నివాసంలో చిరంజీవి ఆయన్ని కలిశారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించిన సమయంలో టాలీవుడ్ నుంచి ముందుగా చిరంజీవే అభినందనలు తెలిపారు..తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డికి,, మోగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు..అదే సమయంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చిత్ర పరిశ్రమపై మండిపడ్డారు..మంత్రిగా తాను ప్రమాణ స్వీకారం చేసిన తరువాత దిల్ రాజు తప్ప పరిశ్రమకు సంబంధించిన ఎవరూ శుభాకాంక్షలు తెలపలేదని కోమటిరెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు..తరువాత దిల్ రాజు ఆధ్వర్యంలో చిత్ర పరిశ్రమకు చెందిన 24 క్రాప్ట్ ల ప్రముఖులు మంత్రి కోమటిరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.. డిసెంబర్ 21వ తేదిన సినీ ప్రముఖులు ముఖ్యమంత్రిని కలిసేందుకు అపాయింట్ మెంట్ వచ్చిందని వెల్లడించారు.. అయితే 21వ తేదిన సినీ పెద్దలు ఎవరూ ముఖ్యమంత్రిని కలవలేదు..ఈలోగా మెగాస్టార్ చిరంజీవి రేవంతరెడ్డిని కలవడం చర్చనీయాశంగా మారింది..కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో సినీ ప్రముఖులకు సీ.ఎం అపాయింట్ మెంట్ దొరకలేదా అన్న విషయం సోషల్ మీడియా వేదికగా చర్చ మొదలైంది.
ఈ రోజు ప్రముఖ సినీ నటుడు శ్రీ చిరంజీవి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.@KChiruTweets pic.twitter.com/RJD2R6m3Wl
— Revanth Reddy (@revanth_anumula) December 25, 2023