AMARAVATHICRIME

వైఎస్ వివేకా హాత్య కేసులో కొత్త సీబీఐ విచారణ బృందం

అమరావతి: సుప్రీంకోర్టు ఆదేశాలతో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రస్తుతం విచారణ చేస్తున్న సీబీఐ బృందం మొత్తాన్ని ఉన్నతాధికారులు మార్చేశారు..ఈ మేరకు మార్చి 29వ తేదీ బుధవారం ఢిల్లీలోని సీబీఐ హెడ్ క్వార్టర్స్ ప్రకటించింది..ప్రస్తుతం ఈ కేసులో విచారణ అధికారిగా ఉన్న రాంసింగ్ ను తప్పించి,,ఆయన స్థానంలో సీబీఐ డీఐజీ చౌరాసియాను నియమించారు..కొత్త టీంలో సభ్యులుగా ఎస్పీ వికాశ్ సింగ్,,ఏఎస్పీ ముఖేష్ కుమార్, ఇన్ స్పెక్టర్లుగా ఎస్.శ్రీమతి,,పునియా,, ఎస్ఐ అంకిత్ యాదవ్ లతో ఆరుగురు సభ్యులతో టీం ఏర్పాటు చేశారు..ఇక నుంచి వీరి ఆధ్వర్యంలోనే హత్య కేసు విచారణ కొనసాగనుంది.. ఏప్రిల్ 30వ తేదీలోగా విచారణ పూర్తి చేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలతో, కొత్త టీం వెంటనే బాధ్యతల స్వీకరించనున్నది..నెల రోజులు మాత్రమే వ్యవధి ఉండటంతో ప్రతిరోజూ విచారణ చేయాలని కొత్త టీం నిర్ణయించికున్నట్లు తెలుస్తొంది.. 

ఇప్పటి వరకు కేసు విచారణ అధికారిగా ఉన్న రాంసింగ్ ను మార్చాలంటూ కేసులోని A5 నిందితుడిగా ఉన్న శంకర్ రెడ్డి భార్య తులసమ్మ దాఖలు చేసిన పిటీషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేసింది..విచారణ బృందాన్ని తప్పించాలని ఆదేశిస్తూ, దర్యాప్తు జరుగుతున్న తీరుపై అసహనం వ్యక్తం చేసింది..మూడేళ్లుగా విచారణ సాగుతున్నా, ఎలాంటి పురోగతి లేనప్పుడు రాంసింగ్ ఉండి ఉపయోగం ఏంటని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది.. ఈ నేధ్యంలో సీబీఐ ఉన్నతాధికారులు, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను చౌరాసియా ఆధ్వర్యంలోని కొత్త టీంకు అప్పగించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *