AMARAVATHIPOLITICS

వైఎస్సార్సీపీని వీడుతున్నట్లు ప్రకటించిన అంబటి రాయుడు

అమరావతి: YSRCP ని వీడుతున్నట్టు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు శనివారం ప్రకటన చేశారు..”పాలిటిక్స్” నా సెకండ్ ఇన్నింగ్స్ అంటూ 10 రోజుల క్రితమే ప్రకటించారు..”వైఎస్సార్సీపీని వీడుతున్నాను…కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను…నా తదుపరి కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తాను” అని ఆయన ట్వీట్ చేశారు..డిసెంబర్ 28వ తేదీన YSRCPలో అంబటి రాయుడు చేరాడు..తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ వైసీపీ అంబటికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
టీడీపీ నేత బుద్ధా వెంకన్న:- వైసీపీలో చేరిన 10 రోజులకే జగన్ గురించి తెలియడంతో,,ఆ పార్టీకి రాయుడు గుడ్ బై చెప్పాడని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు.. అమరావతిలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ”ఆడుదాం ఆంధ్రాకి అంబటి రాయుడు బ్యాట్ పట్టుకొని వచ్చాడు…వచ్చిన 10 రోజులకే జగన్ సైకో అని తెలిసి,, పార్టీకి రాజీనామా చేశాడని వ్యంగ్యంగా వ్యాఖ్యనిస్తూ అంబటి రాయుడుకి శుభాకాంక్షలు” అన్నారు..

https://x.com/RayuduAmbati/status/1743496401525551398?s=20

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *