AMARAVATHINATIONAL

12 Su-30MKI యుద్ధ విమానాల కొనుగోలుకు రూ.10 వేల కోట్లు-రక్షణ మంత్రిత్వ శాఖ

అనుమతులు..
అమరావతి: భారత వైమానిక దళంను మరింత బలోపేతం చేసేందుకు,,కొత్తగా యుద్ధ విమానాల కొనుగోలుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ తాజాగా అనుమతి ఇచ్చింది..12 Su-30MKI యుద్ధ విమానాల కొనుగోలుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కి రూ.10,000 కోట్ల టెండర్ ను జారీ చేసింది..భారత వైమానిక దళంలో యుద్ధ విమానాల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది..
గత 20 సంవత్సరాల్లో 12 సుఖోయ్ యుద్ధ విమానాలు వివిధ సాంకేతిక కారణలతో దెబ్బతినడంతో ఏర్పడిన ఖాళీలను ఈ కొత్త విమానాల కొనుగోలుతో పూరించనుంది.. భారతదేశంలో ఈ విమానాలను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 60 శాతం స్వదేశీ వస్తువులతో తయారు చేయనుంది..ప్రస్తుతం భారతదేశం వద్ద 260 కంటే ఎక్కువ విమానాలు వుండగా,, ఈ కొనుగొలుతో ఇండియన్ ఎయిర్ ఫోర్సులోకి అత్యంత అధునాతన యుద్ధ విమానాలు చేరానున్నాయి..ఈ యుద్ధ విమానాలు ఎయిర్ టు ఎయిర్ క్షిపణులు, బ్రహ్మోస్ ఎయిర్ క్షిపణులు, బాంబులను మోసుకెళ్లగలవు..ఎయిర్-టు-ఎయిర్ రీఫ్యూయలింగ్ సామర్థ్యంతో కూడిన ఈ విమానాలు లాంగ్ రేంజ్ పెట్రోలింగ్ చేస్తాయి..రాఫెల్ ఫైటర్ జెట్ విమానాలతో పాటు బలమైన యుద్ధ విమానాలు భారత వైమానిక దళం అమ్ముల పొదిలోకి రానున్నాయి.. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి భారత వైమానిక దళం సామర్ధ్యాన్ని పెంచుతుందని భారత వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి తెలిపారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *