AMARAVATHINATIONAL

‘‘రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ తరువాత ప్రధాని మోదీ గ్రాఫ్ విపరీతంగా పెరిగిపోయింది,తగ్గించాలి-రైతు నాయకుడు

వీళ్లు నిజమైన రైతులా?

అమరావతి: రైతులు తమ సమస్యలను పరిష్కరించడంతో పాటు డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ట్రాక్టర్లు వేసుకుని వేలాదిమంది దేశ రాజధాని ఢిల్లీని ముట్టడించేందుకు ప్రయత్నిస్తుండగా,, పోలీసులు, భద్రతా బలగాలు వారిని అడ్డుకుంటున్నాయి..ఇదే సమయంలో ఓ రైతు నాయకుడిగా చెలామణి అవుతున్న నేత చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి.. కొన్ని రైతు సంస్థలు కలిసి ‘చలో ఢిల్లీ’ పేరుతో భారీ నిరసన చేపట్టాయి..ఆ రైతు సంస్థల్లో ఒకటైన భారతి కిసాన్ యూనియన్ (ఏక్తా సిద్ధూపూర్) చీఫ్ జగ్జిత్ సింగ్ దలేవాల్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతొంది..వీడియోలో సదరు నాయకుడు మాట్లాడుతూ ‘‘రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ తరువాత ప్రధాని మోదీ గ్రాఫ్ విపరీతంగా పెరిగిపోయింది.. ఎన్నికలకు కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది.. ఈ గ్యాప్‌లోనే మోదీ గ్రాఫ్‌ని మనం తగ్గించాలి’’ అని ఆ వీడియోలో జగ్జిత్ చెప్పారు..

ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్:- ఈ వీడియోపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్పందిస్తూ,, ‘‘ఇది ఒక రాజకీయ ప్రకటన..భారీ నిరసనను నిర్వహించినంత మాత్రాన ప్రధాని మోదీకి ప్రజలు మద్దతివ్వడం మానేస్తారా? నిరసన తెలిపేందుకు ఇది సరైన మార్గం కాదు’’ అని అన్నారు.. తమ డిమాండ్ల కోసం రైతులు అనుసరిస్తున్న పద్ధతిని ఆయన తప్పు పట్టారు..రైతులు ఢిల్లీకి రావడం తమకెలాంటి అభ్యంతరం లేదని,, ఢిల్లీకి వచ్చేందుకు రైళ్లు, బస్సులు, వాళ్ల స్వంత వాహనాలు కూడా ఉన్నాయని అయితే ట్రాక్టర్ల ద్వారా వెళ్లడం ఆమోదయోగ్యం కాదని చెప్పారు.. ఈ రైతులకు తెర వెనుక నుంచి మద్దతు లభిస్తోందన్న అనుమానాల్ని వ్యక్తం చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *