సోషల్ మీడియా అకౌంట్ల ప్రొఫైల్ పిక్గా జాతీయజెండా ఫొటో-మోదీ

అమరావతి: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమం దేశ వ్యాప్తంగా సామూహిక ఉద్యమంగా మారుతోందని,, అందుకు చాలా సంతోషంగా ఉందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు..అదివారం 91వ మన్కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు.. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన షహీద్ ఉధమ్ సింగ్కు ఆయన నివాళులర్పించారు..ఆగస్టు 2వ తేది నుంచి 15వ తేది వరకు ప్రజలందరూ తమ సోషల్ మీడియా అకౌంట్ల ప్రొఫైల్ పిక్గా జాతీయ జెండా ఫొటోను వుంచాలని ప్రధాని మోదీ సూచించారు..ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు ‘హర్ ఘర్ తిరంగా’ పేరుతో ప్రత్యేక ఉద్యమం నిర్వహిస్తున్నాం..3 రోజులు పాటు ప్రతి ఇంటి వద్ద జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటుకోండి…భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న తరుణంలో మనమందరం ఒక అద్భుతమైన,,చరిత్రాత్మక ఘట్టాన్ని చూడబోతున్నాం..దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఈ ఉత్సవాల్లో ఏదో రూపంలో పాల్గొంటున్నారని పేర్కొన్నారు..మువ్వన్నెల జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి ఆగస్టు 2వ తేదినే అని ప్రధాని గుర్తుచేశారు..త్రివర్ణ పతాక రూపకల్పనలో మేడం కామా కూడా కీలక పాత్ర పోషించినట్లు ఆయన స్మరించుకున్నారు..
"मेरा एक सुझाव ये भी है, कि 2 अगस्त से 15 अगस्त तक, हम सभी, अपनी Social Media Profile Pictures में तिरंगा लगा सकते हैं |"
– पीएम @narendramodi.#MannKiBaat #HarGharTiranga
— Mann Ki Baat Updates मन की बात अपडेट्स (@mannkibaat) July 31, 2022