AMARAVATHI

మాజీ సీ.ఎం యెడియూరప్ప ఇంటిపై రాళ్లు రువ్విన నిరసనకారులు

అమరావతి: కర్ణాటక బీజేపీ మాజీ ముఖ్యమంత్రి BS యెడియూరప్ప ఇంటి ముందు సోమవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి..కర్ణాటకలో ఎస్సీల రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి రిటైర్డ్ జడ్జి సదాశివ కమిషన్‌  ఇచ్చిన నివేదికకు వ్యతిరేకంగా ఆందోళనలు నెలకొన్నాయి..బంజార, కొరమ, బోవి వంటి వారికి అన్యాయం చేయకూడదని దళిత సంఘాలు నిరసనలు రూపంలో ఉద్రికత్తలను రెచ్చకొడుతున్నాయి..నేపథ్యంలో సోమవారం మధ్యహ్నం షిమోగా జిల్లాలోని యెడియూరప్ప ఇంటి ముందు నిరసనకారులు ఆందోళనలకు దిగి, రాళ్లు రువ్వారు.. పరిస్థితులు చేయి దాటిపోతుండడంతో బంజారా నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జీ చేసి చెదరకొట్టారు..అలాగే శివమొగ్గలో నిరసనకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి రావడంతో పోలీసులు వారిపై లాఠీ ఝళిపించారు.. శివమొగ్గలో పోలీసులు 144 సెక్షన్ విధించారు..విద్య, ఉద్యోగాల్లో ఎస్సీల రిజర్వేషన్ల విషయంలో కొత్త విధానానికి కేంద్ర సర్కారుకు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం ప్రతిపాదనలు చేయడంతో దళితులు నిరసనలకు దిగుతున్నారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *