జ్ఞానవాపి సముదాయంలోని వ్యాస్ బేస్మెంట్లో పూజలు చేసుకొవచ్చు-సుప్రీం
అమరావతి: కాశీలోని జ్ఞానవాపి సముదాయంలోని వ్యాస్ బేస్మెంట్లో పూజలు చేసుకునేందుకు వ్యతిరేకంగా మసీదు కమిటీ వేసిన పిటిషన్ విచారణలో సోమవారం సుప్రీం ధర్మాసనం ముందుకు వచ్చింది..మసీదు తరఫు న్యాయవాది హుజైఫా అహ్మదీ . పూజలను తక్షణమే నిషేధించాలని డిమాండ్ చేశారు..ఈ వాదనలపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేలమాళిగ ప్రవేశం దక్షిణం వైపు నుంచి,, మసీదు ప్రవేశం ఉత్తరం వైపు నుంచి ఉన్నాయన్నారు..రెండూ ఒకదానికొకటి ప్రభావితం చేయవని,, ప్రస్తుతానికి రెండు వర్గాల ప్రార్థనలు యథావిధిగా కొనసాగించుకోవచ్చని తెలిపారు..దక్షిణ నేలమాళిగలో హిందువులు పూజలు చేసుకోవడానికి దిగువ కోర్టు అనుమతి ఇచ్చింది..ఈ ఆదేశాలను అలహాబాద్ హైకోర్టు సైతం సమర్థించింది.