ఏప్రిల్ 15 వరకు తీహార్ జైల్లో క్రేజీవాల్-జ్యూడీషిల్ కస్టడీ పొడిగించిన సుప్రీం
అమరావతి: ఢిల్లీ లిక్కర్ స్కాం,, మనీ లాండరింగ్ కేసులో నిందితుడు అన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు రోస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ ఏప్రిల్ 15 వరకు పొడిగిస్తూ, తీహార్ జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది..సోమవారంతో ఈడీ కస్టడీ ముగియడంతో కేజ్రీవాల్ను జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని ఈడీ కోర్టును కోరింది..లిక్కర్ పాలసీ,, మనీ లాండరింగ్ కేసు దర్యాప్తుకు కేజ్రీవాల్ సహకరించడం లేదని ఈడీ కోర్టు దృష్టికి తీసుకుని వచ్చింది..కేసు నుంచి తప్పించుకునే సమాధానలు ఇస్తున్నారని తెలిపింది..కేజ్రీవాల్ డిజిటల్ పరికరాల పాస్ వర్డ్స్ ఇవ్వడం లేదని,, తెలీదు అన్న సమాధానాలు మాత్రమే ఇచ్చారని ఈడీ కోర్టుకు తెలియసింది.. ఈడీ వాదనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు కేజ్రీవాల్కు ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.