రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను కలిసిన ఎస్.జైశంకర్
అమరావతి: భారతదేశ విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్,, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను కలిశారు..క్రెమ్లిన్లో వీరిద్దరి మధ్య సమావేశం జరిగింది.. రష్యాలో 5 రోజుల పర్యటనలో బాగంగా జైశంకర్,,వ్లాదిమిర్ పుతిన్ తో సమావేశం అయినప్పుడు అనేక అంశాలపై వాళ్లు చర్చించుకున్నారు..ఉక్రెయిన్ యుద్ధం గురించి కూడా చర్చించుకున్నట్లు చెప్పారు. వచ్చే సంవత్సరం ప్రధానమంత్రి నరేంద్రమోదీ తమ దేశానికి రావాలంటూ ఆహ్వానం పంపినట్లు జైశంకర్ వెల్లడించారు..స్నేహితుడు మోదీ,త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని అకాంక్షించారు.. మోదీ రష్యా పర్యటనకు వస్తే,, సంబంధిత, ప్రస్తుత సమస్యలపై చర్చించగలమని అన్నారు..రష్యా, భారత్ మధ్య సంబంధాలు గతం కంటే మరింత దృడంగా కొనసాగుతాయని తెలిపారు..ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ తో కూడా జైశంకర్ సమావేశం అయ్యారు..
ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ప్రధాని మోదీ తన స్థాయికి తగినట్లు ప్రయత్నం చేశారని పుతిన్ పేర్కొన్నారు.. శాంతియుతంగా రష్యా సమస్యను పరిష్కరించుకునేందుకు సహకరిస్తున్న భారత్ కు సమాచారాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు తెలిపారు..వచ్చే సంవత్సరం జరగనున్న వార్షిక సదస్సులో మోదీ, పుతిన్ భేటీ అవుతారని మంత్రి జైశంకర్ వెల్లడించారు.. ఆ ఇద్దరు నేతలు తరుచూ టచ్లో ఉన్నట్లు చెప్పారు… భారత్, రష్యా మధ్య వాణిజ్య ఆదాయం పెరుగుతోంని,గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వృద్ధి రేటు అధికంగా ఉన్నట్లు పుతిన్ పేర్కొన్నారు.