శ్రీకాళహస్తీలో ధ్వజారోహణం-బ్రహ్మోత్సవాలకు దేవగణానికి స్వాగతం
శ్రీకాళహస్తీ: శ్రీకాళహస్తీశ్వరుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా 2వ రోజైన సోమవారం స్వామి వారి ధ్వజారోహణం అత్యంత వైభవంగా జరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అష్టదిక్పాలకులను బ్రహ్మ,,విష్ణువులను, సకల దేవతా ముని గణాలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణాన్ని నిర్వహించారు. ఆలయంలోని స్వామివారి దర్బాలయం ముందు కొలువు తీర్చారు. వెండి అంబారీలలో అధిష్టింపజేసిన చేసిన స్వామి అమ్మవార్ల ముందు కలిశ స్థాపన చేసి పూజలు చేశారు. త్రిశూలానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వృషభ ధ్వజాన్ని ధ్వజస్తంపై ప్రతిష్టాపించి ప్రత్యేక పూజలు చేసి సకల దేవతా గణాలను స్వాగతం పలికారు..12 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలలో ఎటువంటి విఘ్నాలు జరగకుండా నిర్వాగ్నంగా జరిగేలా చూడమంటూ కర్పూర నీరాజనాలు అర్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఓం నమశ్శివాయ నామస్మరణలు మార్మోగాయి. అనంతరం మళ్లీ పంచమూర్తులు పురవీధుల్లో ఊరేగి భక్తాదులకు దర్శనమిచ్చారు.