కోల్కతా హైకోర్టు ఆదేశాలను ధిక్కరించిన బెంగాల్ సిఐడీ పోలీసులు
అమరావతి: పశ్చిమబెంగాల్ లోని అధికార పార్టీ TMC నాయకుడు,,వందల కోట్ల రూపాయల బియ్యం స్కామ్ పై విచారణ జరిపేందుకు వచ్చిన ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులపై దాడి కేసులో నిందితుడు షేక్ షాజహాన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ బుధవారం సాయంత్రం 4.30 గంటల కల్లా అప్పగించాలని పశ్చిమబెంగాల్ సీఐడీ (CID)ని కోల్కతా హైకోర్టు ఆదేశించింది..కోర్టు ధిక్కార నోటీసును సైతం జారీ చేస్తూ,, దీనిపై 2 వారాల్లోగా జవాబివ్వాలని స్పష్టం చేసింది.. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోల్కతా హైకోర్టు మంగళవారంనాడు ఆదేశాలు జారీ చేసింది..ఇందుకు ససేమిరా అంటూ ఈ ఆదేశాలపై వెంటనే పశ్చిమబెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది..దీనిపై తక్షణమే విచారణ చేపట్టలేమని సుప్రీమ్ కోర్టు స్పష్టం చేసింది..కోర్టు అధేశాల మేరకు కేసు బాధ్యతలు చేపట్టిన సీబీఐ మంగళవారం సాయంత్రమే కేసు నమోదుచేసింది..నిందితులను అదుపులోకి తీసుకునేందుకు పశ్చిమబెంగాల్ సీఐడీ కార్యాలయానికి CBI అధికారులు వెళ్లారు..నిందితుడైన షేక్ షాజహాన్ను అప్పగించేందుకు సీఐడీ నిరాకరించింది..
#WATCH | CBI team arrives at Bhabani Bhaban Police Headquarters in Kolkata, West Bengal.
Calcutta High Court today observed that investigation into the attack on ED officials should be handed over to CBI and the custody of accused Sheikh Shahjahan be done by 4:15 pm today. pic.twitter.com/GlZi0CI4gB
— ANI (@ANI) March 6, 2024