AMARAVATHIMOVIE

ప్రియుడితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్

అమరావతి: శ్రీదేవీ కుమార్తె,,బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పుట్టిన రోజు (మార్చి 6).సందర్భంగా జాన్వీ తన ప్రియుడితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు..వీరితోపాటు ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్,,శ్రీదేవికి చెల్లెలు అయిన మహేశ్వరి,,జాన్వీ కపూర్ కు చిన్నమ్మతో కలసి శ్రీవారిని దర్శించుకుంది..మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో జాన్వీ కొన్నేళ్లుగా ప్రేమలో ఉందనే ప్రచారం సాగుతొంది.. వీరిద్దరు కలిసి రెస్టారెంట్స్,,పార్టీలు,,మూవీ ఈవెంట్లలో కలసి కనిపిస్తున్నారు..ఇటీవల జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్లలోనూ జాన్వీ,, శిఖర్ కలిసి హాజరయ్యారు..

ప్రస్తుతం జాన్వీ దేవర సినిమాలో నటిస్తున్నారు… డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ లో ఎన్టీఆర్ సరసన జాన్వీ కనిపించనుంది..ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది..అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్ లో రాబోతున్న ప్రాజెక్టులోనూ జాన్వీ ఎంపికైంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *