AMARAVATHIPOLITICS

జనసేన పార్టీకి గ్లాస్ గుర్తును కేటాయించిన కేంద్ర ఎన్నికల సంఘం

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘం గ్లాస్ గుర్తును జనసేన పార్టీకే కేటాయించింది..జనసేన పార్టీకి ఎన్నికల గుర్తుగా మరోసారి గ్లాస్ ను కేటాయించినందుకు ఎన్నికల సంఘానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అని పేర్కొంటూ ఆ పార్టీ ప్రకటన విడుదల చేసింది..ఆంధ్రప్రదేశ్,, తెలంగాణ రాష్ట్రాలకు గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో జనసేన అభ్యర్థులు గ్లాస్ గుర్తుపైనే పోటీ చేసిన విషయం విదితమే..ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 137 స్థానాలు,, తెలంగాణ నుంచి 7 లోక్ సభ స్థానాలలో జనసేన అభ్యర్థులు పోటీ చేశారు..తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో జనసేన మళ్లీ పోటీకి సిద్ధమైంది..రిజిస్టర్డ్ పార్టీ అయిన జనసేనకు గ్లాస్ గుర్తును కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసింది. జనసేనపార్టీకి గాజు గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కొంత కాలం కింద రద్దు చేసింది..దింతో జనసేన పార్టీకి గుర్తు ఉండబోదంటూ ప్రచారం కూడా జరిగింద..అయితే కేంద్ర ఎన్నికల సంఘం పార్టీకి అదే గుర్తును కేటాయించి ఈ ఉహాగానలకు ముగింపు పలికింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *