అండమాన్ నికోబార్ దీవులను ఆనుకుని అల్పపీడనం
అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతం అండమాన్ నికోబార్ దీవులను ఆనుకుని అల్పపీడనం కేంద్రీకృతమైందని, 15వ తేది నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తుల సంస్థ తెలిపింది..ఇది వాయువ్య దిశగా పయనించి గురువారం నాటికి 16 ఆంధ్రప్రదేశ్ తీరంలో తీవ్ర వాయు గుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది..శుక్రవారం నాటికి ఇది ఉత్తర-ఈశాన్య దిశగా తిరిగి ఒడిశా తీరానికి చేరుకుంటుందని తెలిపింది..దీని ప్రభావంతో బుధవారం కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని,,సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.