AMARAVATHINATIONAL

ప్రత్యేక సమావేశాల్లో చారిత్రక నిర్ణయాలు-ప్రధాని మోదీ

అమరావతి: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో చారిత్రక నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు..ప్రత్యేక సెషన్ కాలవ్యవధి తక్కువే కావచ్చు కానీ ఈ సందర్భానికి ఈ సమావేశాలు చాలా పెద్దవని చెప్పారు..పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్న సందర్భంగా పార్లమెంటు ముందు ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడుతూ,, భారత్ అధ్యక్షతన జరిగిన G20 శిఖరాగ్ర సదస్సు విజయవంతమవడంపై హర్షం వ్యక్తం చేశారు..ప్రపంచ భవిష్యత్తుకు భారత్ ఆశాకిరణంగా మారిందని,,భారత ఉజ్వల భవిష్యత్తుకు G20 సదస్సు మార్గదర్శనం చేసిందన్నారు..కొత్త సంకల్పం దిశగా మరిన్ని అడుగులు ముందుకు వేయాలని కోరారు..2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరిస్తుందని చెప్పారు.. చంద్రయాన్-3తో మన భారతదేశ జెండా సగర్వంగా రెపరెపలాడిందని పేర్కొన్నారు..చంద్రయాన్ విజయంతో దేశానికి పేరు, ప్రఖ్యాతులు వచ్చాయని,,అలాగే శిశక్తిపాయింట్ నవ శకానికి స్ఫూర్తి కేంద్రాగా మారిందన్నారు..ఇలాంటి విజయాలు సాధించినప్పుడే శాస్త్ర,, సాంకేతికతలో మన ఎంత ముందున్నామో ప్రపంచానికి తెలుస్తుందన్నారు..ఈ విజయంతో అనే అవకాశాలు భారత్ తలుపులు తడుతాయని,,అదే సమయంలో భారత్ పురోగతిని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయని వెల్లడించారు. 5 రోజులపాటు జరుగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల సందర్భంగా 75 సంవత్సరాల్లో పార్లమెంటు ప్రస్థానంపై తొలి రోజు చర్చ జరుగనుంది. ప్రత్యేక సమావేశాల్లో కేంద్రప్రభుత్వం నాలుగు బిల్లులను ప్రవేశపెట్టనుంది..అనంతరం లోక్ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *