AMARAVATHI

GO NO.1 రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పురాష్ట్ర ప్రభుత్వంకు చెంప్పపెట్టు-కొల్లు.రవీంద్ర  

అమరావతి:  GO NO.1 రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వంకు చెంప్పపెట్టు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర  అన్నారు.. శనివారం మీడియాతో మాట్లాడుతూ  ప్రభుత్వం సుప్రీమ్ కోర్టుకు వెళతామని చెప్పడం దారుణమన్నారు..గతంలో టీడీపీ ప్రభుత్వం ఇలాంటి నిబంధనలు అమలు చేసి వుంటే జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేవారా అంటు ప్రశ్నించారు.నాలుగు సంవత్సరాలు రాష్ట్రన్ని అభివృద్ది చేయకుండా,ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయన్న భయంతో,,పాత శిలఫలకాలకి మళ్లీ శంఖుస్థాపనలు చేయడం సిగ్గుచేటున్నారు.. ప్రతిపక్షపార్టీలను ప్రజల వద్దకు వెళ్లనీయకుండా అడ్డుకునేందుకు వైసీపీ ప్రభుత్వం జీవో-1 తీసుకుని వచ్చిందన్నారు.. ప్రతిపక్షాలకు నిరసనలు తెలిపేందుకు అవకాశం లేకుండా,,అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేశారని మండిపడ్డారు.. బ్రిటిష్ ప్రభుత్వం ఇలాంటి జీవో తెస్తే స్వాతంత్ర్యోద్యమం జరిగేదా ? 75 సంవత్సరాలుగా ఎవరూ రహదారులపై సభలు పెట్టలేదా ? మనం ఏ రోజుల్లో ఉన్నామో అర్దం కావడంలేదని విచారణ సందర్బంగా హైకోర్టు వ్యాఖ్యనించిందంటే జీవో ఎంత దారుణమైందో అర్ధం చేసుకోవచ్చన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *