టోల్ ప్లాజాల్లో ఏప్రిల్ 1 నుంచి పెరిగిన ఛార్జీలు అమలు
అమరావతి: నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) టోల్ చార్జీలు పెంచాలని నిర్ణయం తీసుకుంది.. పెరిగిన టోల్ చార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి..ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో టోల్ ఛార్జీలను సమీక్షిస్తారు..ఇందులో భాగంగానే ఈ సంవత్సరం 5 నుంచి 10 శాతం వరకు ఛార్జీలు పెంచుతున్నట్లు NHAI అధికారులు తెలిపారు..ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని జాతీయ రహదారులపై తిరిగే అన్ని రకాల వాహనాల (మోటర్ బైక్స్ మినహా) టారిఫ్ ధరలను 10 రూపాయల నుంచి 60 రూపాయల వరకు పెంచారు.