AMARAVATHIDISTRICTS

మర్రిపాడు,బూదడ వద్ద బోల్తాపడిన బస్సు,ప్రయాణికులకు స్వల్పగాయాలు

నెల్లూరు: నెల్లూరు, ముంబై జాతీయ రహదారిపై మర్రిపాడు మండలం బూదడ వద్ద V KAVERI, NL 07-B0720 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది..గురువారం ఉదయం 6.30 గంటల సమయంలో బెంగళూరు నుంచి వినుకొండకు వస్తుండగా మర్రిపాడు వద్ద రోడ్డుకు అడ్డంగా గేదె(బర్రె) వచ్చింది..దానిని తప్పించేందుకు డ్రైవర్ ప్రయత్నించినప్పటికి,,గెదెను ఢీ కొంటూ బస్సు బోల్తా పడింది..ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.. బస్సు బోల్తా పడడంతో ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి..స్థానికులు సమాచారంతో పోలీసులు గాయపడ్డ వారిని 108 సహాయంతో ఉదయగిరి,,ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు..ప్రయాణికులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *