AMARAVATHIDISTRICTS

టీడీపీ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను నిలిపి వేశారు-రమాదేవి

అధికారంలోకి రాగానే…
నెల్లూరు: టీడీపీ ప్రభుత్వం గతంలో పేద ప్రజల కోసం అమలు చేసిన పలు సంక్షేమ పథకాలను వైసీపీ ప్రభుత్వం కక్ష్యపూరితంగా నిలిపి వేసిందని డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి అవేదన వ్యక్తం చేశారు.శనివారం నగరంలొని 48వ డివిజన్ పరిధిలో మాజీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,,పొంగూరు నారాయణకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు..ఈ సందర్బంలో అమె మీడియాతో మాట్లాడుతూ నగరంలోని పలు డివిజన్లల్లో పర్యటిస్తున్నప్పుడు ప్రజలు అనేక సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వంలో పేదల కడుపు నింపేందుకు అన్న క్యాంటీన్లు, చంద్రన్న భీమా,, ముస్లింలకు దుల్హన్ పథకం, రంజాన్ తోఫా, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను టీడీపీ ప్రభుత్వం చేపట్టిందన్నారు..వైసిపి ఈ ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసిందని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ,మరెన్నో సంక్షేమ పథకాలు అందించబోతున్నామని తెలిపారు.నెల్లూరు నగర శానసభ్యులుగా పోటీచేస్తున్న పొంగూరు నారాయణ,,వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని అభ్యర్థించారు .

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *