AMARAVATHIDISTRICTS

ఆంధ్ర‌రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోస‌మే ఉమ్మ‌డిగా పోటీ-నారాయ‌ణ‌

టీడీపీ ప్ర‌భుత్వంలో హ‌మాలీల‌కు త‌గిన ప్రాధాన్య‌త..

నెల్లూరు: ఆంధ్ర రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు, ప్ర‌జ‌ల సంక్షేమం దృష్ఠ్యా టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీలు ఉమ్మ‌డి కూట‌మిగా రానున్న ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన‌ట్లు మాజీ మంత్రి,నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ తెలిపారు. నెల్లూరుస్టోన్‌హౌస్‌పేట‌లోని ఓ క‌ళ్యాణ‌మండ‌పంలో భార‌తీయ జ‌న‌తాపార్టీ నాయ‌కులు ఏర్పాటు చేసిన హ‌మాలీలు నాయ‌కులు, కార్మికుల ఆత్మీయ స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా నారాయ‌ణ మాట్లాడుతూ టీడీపీ ప్ర‌భుత్వంలో హ‌మాలీల సంక్షేమం కోసం ఎంతో చేశామ‌ని చెప్పారు. రానున్న టీడీపీ ప్ర‌భుత్వంలో త‌గిన ప్రాధాన్య‌త ఇస్తామ‌ని భ‌రోసా ఇచ్చారు..ప్ర‌స్తుతం రాష్ట్రంలో రాక్ష‌స ప‌రిపాల‌న సాగుతుంద‌ని నారాయ‌ణ మండిప‌డ్డారు. మాట్లాడితే అక్ర‌మ కేసులు పెట్ట‌డ‌మో, జైలుకు పంప‌డ‌మో చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.రాష్ట్ర అభివృద్దే లక్ష్యం కూటమి ప్రభుత్వం ముందుకెళుతుందన్నారు..నెల్లూరును మోడ‌ల్‌సిటీగా మార్చే బాధ్య‌త తాము తీసుకుంటామ‌ని,,త‌మ‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని నారాయ‌ణ కోరారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *