చంద్రబాబు అరెస్టుపై ప్రజల నుంచి సానుభూతి లేదు-మంత్రి చెల్లుబోయిన
అమరావతి: విశాఖ నుంచి పరిపాలన ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది అనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్వరలోనే చెబుతారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు..బుధవారం కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ పరిపాలన వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని వేణుగోపాలకృష్ణ అన్నారు..దసరా నుంచి విశాఖలో పాలన అని కేబినెట్ సమావేశంలో సీ.ఎం జగన్ అనలేదని తెలిపారు..విద్యారంగంలో జగన్ పెను మార్పులు తీసుకొస్తున్నారని చెప్పారు..చంద్రబాబు అరెస్టుపై ప్రజలకు వాస్తవాలు తెలుసని,,అందుకే చంద్రబాబు అరెస్టుపై ప్రజల నుంచి స్పందన లేదన్నారు..ఓ సినీనటుడు వచ్చి చంద్రబాబుతో ములాఖత్ అంటూ మిలాఖత్ అయిపోయారని ఎద్దేవా చేశారు.. టీడీపీ అధినేత చంద్రబాబును అన్ని ఆధారాలతోనే అరెస్టు చేశారని,,అయన, మొత్తం తొమ్మిది కేసులపై స్టే తెచ్చుకున్నారని చెప్పారు..జమిలి ఎన్నికలపై కేంద్రం నిర్ణయమే ఫైనల్ అని,,ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని సీ.ఎం సూచించారని వెల్లడించారు.