AMARAVATHINATIONAL

G-20 సమావేశాల్లో పాల్గొనేందుకు భారత్ కు చేరుకున్న అగ్రదేశాధినేతలు

అమరావతి: ప్రతిష్ఠాత్మక G-20 సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు..ఆయనకు కేంద్రమంత్రి వీకే సింగ్ స్వాగతం పలికారు..ప్రధాన మంత్రి మోడీతో బైడెన్ సమావేశం కానున్నారు..రక్షణ, సాంకేతిక, వాణిజ్యరంగాల్లో ఒప్పందాలపై కీలక చర్చలు జరపనున్నారు. శనివారం మహాత్మాగాంధీకి నివాళి అర్పించనున్నారు..ఆనంతరం G-20 శిఖరాగ్ర సమావేశాలకు హాజరుకానున్నారు.. ఈ సదస్సు ముగిసిన తరువాత వియత్నాం వెళ్లనున్నారు..జేఈజెట్ ఇంజిన్ ఒప్పందం, అమెరికా నుంచి ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలు, 5జీ, 6జీ స్పెక్ట్రమ్, అధునాతన సాంకేతికతల అభివృద్ధికి పరస్పర సహకారం, అణురంగంలో పురోగతి తదితర అంశాలపై ఇద్దరు నేతలు చర్చించనున్నారు..ఈ సమావేశానికి సంబంధించి అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవాన్ పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించారు..మోడీతో సమావేశం పూర్తయ్యాక ఐటీసీ మౌర్య హోటల్లో బైడెన్ బస చేస్తారు..భద్రతా చర్యల్లో బాగంగా ఇప్పటికే హోటల్లోని అన్ని ఫోర్లు( 400 గదులు)ను అమెరికా సీక్రెట్ సర్వీస్ కమాండోలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు..
కెనడా అధ్యక్షడు జిస్టిన్ ట్రూడో శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు..ఆయనకు రాజీవ్ చంద్రశేఖర్ స్వాగతం పలికారు..
బంగ్లాదేశం దేశ ప్రధాన మంత్రి హసీనా శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *