భారత వాయుసేనకు చెందిన వాహనంపై ఉగ్రవాదుల దాడులు
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఐదుగురు జవాన్లు గాయపడ్డారు..వారిలో ఇద్దరి పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో ఎయిర్లిఫ్ట్ ద్వారా ఉదంపూర్లోని కమాండ్ హాస్పిటల్కు తరలించారు.. సురాన్కోట్ ఏరియాలోని సనాయ్ టాప్ ప్రాంతానికి కాన్వాయ్కు వెళ్తుండగా ఈ దాడి జరిగినట్టు అధికారులు తెలిపారు..సమాచారం అందిన వెంటనే అధికారులు అదనపు బలగాలను ఈ ప్రాంతంకు రప్పించి పెద్దఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు.