ఏపీలో 24 గంటలు కరెంట్ ఉండదు,అక్కడి ప్రజలు తెలంగాణకు వలస వస్తుంటారు-కేసిఆర్
హైదరాబాద్:.ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితులపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ మాట్లాడుతూ ఏపీలో 24 గంటలు కరెంట్ ఉండదని,,అక్కడి ప్రజలు పొరుగు రాష్ట్రమైన తెలంగాణకు వలస వస్తుంటారని వ్యాఖ్యనించారు.. సోమవారం జోగులంబ గద్వాల జిల్లాలో బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి చెబుతూ మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన తెచ్చారు..
”తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు..ఒకనాడు చాలా కష్టాల్లో మునిగిపోయి గంజి కేంద్రాలు పెట్టిన ప్రాంతం పాలమూరు జిల్లా. జోగులాంబ గద్వాలలో పాదయాత్రలో అప్పటి దృశ్యాలు చూసి కన్నీళ్లు పెట్టుకున్నాం..మహబూబ్ నగర్ లో 14 రోజులకు ఒకసారి నీళ్లు వచ్చేవి..అనేక రకాల బాధలు ఈ జిల్లా ప్రజలు అనుభవించారు..పక్క రాష్ట్రాల నుంచి ప్రజలు వలస వస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు.