AMARAVATHIDISTRICTSPOLITICS

పేదలెవరో, పెత్తందార్లు ఎవరో జగనే చెప్పాలి-ఆనం.వెంకటరమణరెడ్డి

నెల్లూరు: జగన్ కి రూ.2,38,60,435 షేర్లు భారతీ సిమెంట్స్ లో ఉన్నాయని,,అలాంటప్పుడు జగన్ పేదవాడు ఎలా అవుతాడని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు..అదివారం టీడీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ షేర్ల విలువ రూ.2,500 కోట్లు పైమాటే,, ఇప్పుడు పేదలెవరో, పెత్తందార్లు ఎవరో జగనే చెప్పాలని డిమాండ్ చేశారు..శ్రీవారికి,, శ్రీమతికి కలిపి రూ.4వేల కోట్లకి పైగా షేర్లు ఉన్నాయని చెప్పారు..భారతీ సిమెంట్స్ ఒక త్రైమాసికంలో రూ.235కోట్లు ఆదాయం చూపారని,,2001 నుంచి 2024 వరకు టర్నోవర్ రూ.2వేల కోట్లుకు ఎలా పెరిగిందని ప్రశ్నించారు..వైఎస్ఆర్ పేరుతో నిర్మిస్తున్న 30 లక్షల ఇళ్లకి భారతీ సిమెంటు వాడారా? లేదా? అంటూ నిలదీశారు..

వైఎస్ భారతీ ఏడాదికి రూ.2కోట్ల 90 లక్షల జీతం, రూ.కోటి ఎలవెన్సులు తీసుకున్నది వాస్తవం కాదా?.. 2018లో రూ.1077 కోట్లు నుంచి గత ఏడాదికి రూ.2009 కోట్లకి ఎలా పెరుగుతుంది…మూడు నెలల్లో రూ.952కోట్లు టర్నోవర్ సాధించండం చిన్న విషయం కాదని అన్నారు.. భారతీ సిమెంట్స్ పుణ్యమాని మిగిలిన సిమెంటు కంపెనీలు అన్నీ మూతపడే పరిస్థితికి వచ్చాయన్నారు.. భారతదేశంలోనే ఒక్క రూపాయి బ్యాంకు అప్పులేని సిమెంట్ కంపెనీ భారతీ సిమెంట్సే ఒక్కటే అని వ్యంగ్యంగా వ్యాఖ్యనించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *