AMARAVATHINATIONAL

మారింతం భీకరంగా మారనున్న బిపొర్ జాయ్ తుపాను-ఐఎండీ

అమరావతి: అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపొర్ జాయ్ తుపాను కారణంగా రాష్ట్రంలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ఎలాంటి ప్రభావం చూపించలేక పోతున్నాయ..ఈ నేపధ్యంలో బిపొర్ జాయ్ తుపాను రాబోయే  మరో 36 గంటల్లో మరింత బలపడి గుజరాత్ లొని కచ్,, పాకిస్థాన్ లొని కరాచీల్లో ఈనెల 15వ తేదీన తీరం దాటే అవకాశం వుందని భారత వాతావరణశాఖ తెలిపింది..ఈ నేపథ్యంలో గుజరాత్ తీర ప్రాంత వాసులకు వాతావరణ శాఖ ఎల్లో అల్టర్ జారీ చేసింది..గుజరాత్,,కర్ణాటక,, గోవాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.. మహారాష్ట్ర,,తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉండవచ్చని అంచనా వేస్తోంది.. బిపొర్ జాయ్ తుఫాన్ ప్రభావంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు సమీక్ష సమావేశం నిర్వహిస్తారని అధికార వర్గాలు తెలిపాయి..ప్రస్తుతం తూర్పు మధ్య అరేబియా తీరంలో కేంద్రీకృతమైన తుఫాను గంటకు 8 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు ఐఎండీ వెల్లడించింది..తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 135 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది..లోతట్టు ప్రాంత ప్రజలను తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సెంటర్లోకి తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు..బీపోర్ జాయ్ తుఫాన్ ప్రభావంతో మహారాష్ట్ర రాజధాని ముంబైలోని బలమైన గాలులు వీస్తున్నాయి..దీంతో ముంబై ఎయిర్ పోర్ట్ లో విమాన రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.. గాలుల తీవ్రత కారణంగా కొన్ని విమానాల రద్దు చేయగా మరికొన్ని ఆలస్యంగా నడుస్తాయని అధికారులు తెలిపారు.. కొన్నివిమానలను ముంబై ఎయిర్పోర్టులో ల్యాండ్ చేసే పరిస్థితి లేక మరో ఎయిర్ పోర్టుకు మళ్లీంచిన్నట్టు అధికారులు తెలిపారు..వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల ముంబై ఎయిర్ పోర్ట్ లోని 09/27 రన్ వేను తాత్కాలికంగా మూసివేసినట్లు ఎయిర్ పోర్టు అథారిటీ వెల్లడించింది..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *