AMARAVATHIDISTRICTS

జిల్లాలో జాతీయ రహదారులు నిర్మాణం కోసం భూ సేకరణ పనులు వేగవంతం చేయాలి- జిల్లా కలెక్టర్

నెల్లూరు: జిల్లాలో జాతీయ రహదారులు నిర్మాణం కోసం భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం .హరి నారాయణన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జాతీయ రహదారులకు భూసేకరణ, రామాయపట్నం నిర్వాసితుల పునరావాసానికి అవసరమైన భూ సేకరణ పై ఎన్. హెచ్, ఆర్డీవోలు, మ్యారిటైమ్ బోర్డు అధికారులతో కలెక్టర్ సమీక్ష చేశారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పేద రైతులను దృష్టిలో పెట్టుకుని హైవేస్ అధికారులు బద్వేలు- నెల్లూరు జాతీయ రహదారి భూ సేకరణలో నిబంధనల ప్రకారం ధర పెంచి ఇచ్చే విషయంలో సహకరించాలన్నారు. అలాగే కృష్ణపట్నం పోర్ట్ రహదారికి సంబంధించిన భూ సేకరణ, అవార్డు పాస్ చేయటం త్వరితగతిన చేపట్టాలని సూచించారు.
రామాయపట్నం పోర్టు నిర్వాసితుల సేకరణ కోసం ఎక్కువ మంది సిబ్బందిని టీం గా ఏర్పాటుచేసి భూ సేకరణ చేయాలని, అవార్డు పాస్ చేయటం, డిడి పబ్లికేషన్ పూర్తి చేయాలని అన్నారు. ఇంకా పోర్టు భూములకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే వాటిని కూడా త్వరగా పరిష్కరించాలని తెలిపారు. ఈ సమావేశంలో కందుకూరు సబ్ కలెక్టర్ విద్యాధరి, ఆర్డీవో మలోల, ఆత్మకూర్ ఆర్డీవో మధులత, మ్యారిటైమ్ బోర్డు అధికారులు ఐ వి రెడ్డి, పద్మావతి, ఎన్ హెచ్ ఏ ఐ పి డి గోయల్ ,తదితరులు పాల్గొన్నారు.

జిల్లా సమాచార పౌలు సంబంధాలు అధికారి కార్యాలయం, నెల్లూరు

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *