AMARAVATHI

చిరుత దాడిలో ఘటనలో టీటీడీ పరిహారం అందచేయకపోవడంపై అసంతృఫ్టి వ్యక్తం చేసిన హైకోర్టు

అమరావతి: తిరుమల కాలిబాటలో చిరుత దాడిలో మరణించిన లక్షిత కుంటుంబానికి రూ.5 లక్షలు పరిహారం అందచేయక పోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృఫ్టి వ్యక్తం చేసింది..కోర్టు ఆదేశించిన పరిహారం చెల్లించకపోవడం ఏమిటని తిరుమలతిరుపతి దేవస్థానంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది..బాధిత కుటుంబాల పట్ల టీటీడీ అనుసరించిన వైఖరి అనుసరిణీయం కాదన్న అభిప్రాయం వ్యక్తం చేసింది..నడకదారిలో ఫెన్సింగ్ వేసేందుకు వైల్డ్ లైఫ్ కార్పొరేషన్ ఆఫిడవిట్ లో సుముఖత వ్యక్తం చేసింది..అలాగే నడకమార్గంలో అవసరమైన ప్రాంతాల్లో అండర్ పాసులు ఏర్పాటు చేసేందుకు అభ్యంతరం లేదని వైల్డ్ లైఫ్ తెలిపింది.. వైల్డ్ లైఫ్, టీటీడీ, రాష్ట్ర అటవీ శాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని పిటీషనర్ తరపు న్యాయవాది మంజుల కోరింది..రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని టీటీడీ, తదితరులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *