AMARAVATHINATIONAL

‘వికసిత్ భారత్’ లక్ష్య సాధన కోసం జరుగుతున్న ఎన్నికలు-ప్రధాని మోదీ

అమరావతి: మూడవసారి పాలన సాగించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని,,త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలు కేవలం ప్రభుత్వం ఏర్పాటు కోసం జరుగుతున్నవి కాదని,, ‘వికసిత్ భారత్’ లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఎన్నికలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు..ఆదివారంనాడు  ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నుంచి లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి మోదీ శ్రీకారం చుట్టిన సందర్బంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ అవినీతిపై తమ ప్రభుత్వం కొరడా ఝలిపించడంతో కొంత మంది వ్యక్తులు కుతకుతలాడుతున్నారంటూ విపక్షాలు, అవినీతి నేతల అరెస్టులపై ప్రధాని విమర్శలు సంధించారు..గత 10 సంవత్సరాలుగా అవినీతిపై బీజెపీ పోరాటం సాగిస్తున్న విషయం దేశం యావత్తూ తెలుసునని,, పేద ప్రజల సొమ్మును దళారులు దోచుకోకుండా నిలవరించామన్నారు.. అవినీతిపై తాను సాగిస్తున్న పోరాటం కొందరికి ఇబ్బందిగా మారిందని కాంగ్రెస్ పార్టీ గురించి పరోక్షంగా వ్యాఖ్యనించారు..”భ్రష్టాచార్ హఠావో” అనేది మోదీ మంత్రమని, “భ్రష్టాచార్ బచావో” అనేది విపక్షాల నినాదమని విమర్శించారు. అవినీతిపై పోరాడుతున్న NDAకు, అవినీతికి కొమ్ముకాసే వర్గానికి మధ్య జరుగుతున్న పోరాటమే అన్నారు.. ఈ ఎన్నికలు లక్ష్యం భారతదేశం 3వ ఆర్దిక శక్తిగా ఎదిగేందుకు ముందు అడుగన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *