ఉదయనిధి స్టాలిన్, ప్రియాంక్ ఖర్గేలపై యు.పీలో కేసు నమోదు
అమరావతి: డీఎంకే నేత, క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ తో పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేలపై బుధవారం ఉత్తరప్రదేశ్ లోని FIR నమోదు అయ్యింది.. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.. ఉదయనిధి వ్యాఖ్యలకు ప్రియాంక్ ఖర్గే వత్తాసు పలికారు..IPC Sec 295-A(మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం), 153-A(రెండు గ్రూపులను రెచ్చగొట్టడం) కింద ఇద్దరిపై కేసు నమోదు చేశారు.. ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్,, సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ లో లాయర్లు హర్షగుప్తా, రామ్ సింగ్ లోధీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసును పోలీసులు కేసు నమోదు చేశారు..తమ మనోభావాలను దెబ్బతీసేలా రాజకీయ వేత్తలు ప్రసంగాలు చేసినట్లు స్టాలిన్ పై ఫిర్యాదు చేశారు..