బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో ఇద్దరు కీలక నిందితులు అరెస్ట్-ఎన్ఐఏ
అమరావతి: బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బెంగాల్కు చెందిన ముసావీర్ షాజీబ్ హుస్సేన్,, అబ్దుల్ మాథీన్ అహ్మద్ తాహాను శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్లు ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి.. పేలుడుకు పాల్పడిన వారిలో ఈ ఇద్దరు ప్రధాన కుట్రదారుల్లో ఒకరుగా ఎన్ఐఏ అధికారులు ఇప్పటికే గుర్తించారు.. పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వీరిద్దరి ఆచూకీ కనిపెట్టేందుకు ఎన్ఐఏ బృందాలు దేశవ్యాప్తంగా తీవ్రంగా గాలిస్తున్నాయి..ప్రధాన నిందితులైన ముసావీర్ షాజీబ్ హుస్సేన్,, అబ్దుల్ మాథీన్ అమ్మద్ తాహాల సమాచారం తెలిపితే ఒక్కొక్కరిపై రూ.10లక్షల వంతున రూ.20 లక్షలను బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపింది..కేఫ్లో ముసావీర్ హుస్సేన్ షాజీబ్ ఐఈడీని అమర్చాడని పేర్కొంది.. వీరి సమాచారం తెలిసిన వారు 080-29510900 ఫోన్ నంబర్కు కానీ, info. blr. nia@gov.in ఈ-మెయిల్కు సమాచారం ఇవ్వాలని కోరింది.
(బెంగళూరులోని ప్రముఖ రెస్టారెంట్ రామేశ్వరం కేఫ్లో మార్చి 1వ తేది శుక్రవారం బాంబ్ బ్లాస్ట్ ఘటన చోటుచేసుకొవడంతో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు..ఈ ఘటనలో మాస్క్, క్యాప్ ధరించిన ఓ వ్యక్తి బస్సులో ప్రయాణించి కేఫ్కు వచ్చినట్లు గుర్తించారు.)