పాకిస్తానీ డ్రోన్ నుంచి స్వాధీనం చేసుకున్న 3 కేజీ హెరాయిన్
అమరావతి: భారతదేశ సరిహద్దుల ద్వారా ఆక్రమంగా అయుధాలను,,డ్రగ్స్ ను చేరవేసేందుకు నిరంతరం కుయుక్తులు పన్నుతునే వుంటుంది..పాకిస్తాన్ పన్నాగలను సరిహద్దు భద్రతా దళం (BSF) దళాలు వమ్ముచేస్తునే వున్నాయి..ఈ నేపధ్యంలో సోమవారం పాకిస్తాన్ వైపు నుంచి వస్తున్న ఒక డ్రోన్ ను BSF దళాలు జామర్ ను ఉపయోగించి నిర్విరీయం చేశాయి..అనంతరం BSF దళాలు పంజాబ్ పోలీసులతో సంయుక్తంగా జరిపిన సెర్చ్ ఆపరేషన్ లో టార్న్ తరణ్ జిల్లాలోని ఖేమ్ కరన్ గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రం నుంచి పాకిస్తానీ డ్రోన్ తో పాటు పసుపు టేప్ తో చుట్టబడిన సుమారు 3 కిలోల బరువున్న హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు.