AMARAVATHICRIME

నదియా జిల్లాలోని చెరువు నుంచి 40 బంగారు బిస్కెట్స్ స్వాధీనం-విలువ రూ.2.57 కోట్లు

అమరావతి: దేశ సరిహద్దు భద్రతాదళం (BSF) వెస్ట్ బెంగాల్ లోని నార్త్ 24 పరగాణ ప్రాంతంలో 2.57 కోట్లు విలువ చేసే 4.6 kgలు వున్న 40 బంగారు బిస్కెట్స్ ను చిన్నపాటి చెరువు నుంచి స్వాధనం చేసుకోవడం జరిగిందని భద్రతాదళాల అధికారి తెలిపారు.. BSF అధికారి తెలిపిన వివరాలు ఇలా వున్నాయి….గతంలో ఒక వ్యక్తి బంగారం స్మగ్లర్ చేస్తున్న సమయలో పోలీసులు వెంబడించడంతో నార్త్ 24 పరగాణ ప్రాంతంలోని ఓ చెరువులోకి దూకి తప్పించుకున్నాడు..చుట్టు ప్రక్కల పోలీసులు వుంటారన్న భయంతో సదరు స్మగ్లర్ తన వద్ద వున్న 40 బంగారు బిస్కెట్స్ ను చెరువులోనే దాచి పెట్టడడం జరిగింది..అటు తరువాత స్మగ్లర్ ను పోలీసులు అరెస్ట్ చేసి ఎంత విచారించిన బంగారం గురించి తెలియరాలేదు..తప్పని పరిస్థితిల్లో పోలీసులు అతన్ని వదిలి వేయాల్సి వచ్చింది..ఈ సంఘటన జరిగి దాదాపు 6 నెలలు అయింది..రెండు రోజుల క్రిందట చెరువులో బంగారం బిస్కెట్స్ వున్నట్లు పక్కా సమాచారం అందడంతో BSF అధికారులు రంగంలోకి దిగారు..మెటల్ డిటెక్టర్ తో గాలించి,బంగారం వున్న బ్యాగ్ ను BSF సిబ్బంది కనుగొన్నారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *