“ఆది మహోత్సవ్”ను ప్రారంభించిన ప్రధాని మోదీ
అమరావతి: మెగా నేషనల్ ట్రైబల్ ఫెస్టివల్ “ఆది మహోత్సవ్”ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు.. గురువారం ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో తొలుత గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు..అనంతరం గిరిజన ఉత్పత్తుల స్టాల్స్ ను పరిశీలించారు..దాదాపు 1000 మంది గిరిజన కళాకారులు పాల్గొంటున్న”ఆది మహోత్సవ్”లో గిరిజనుల వారసత్వాన్ని 200 స్టాళ్లలో ప్రదర్శిస్తున్నారు..2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా జరుపుకుంటున్నందున చేనేత,,మట్టి కుండలు,,హస్తకళలు,,ఆభరణాలు వంటి సాధారణ విభాగాలతో పాటు,, గిరిజనులు పండించే ప్రత్యేక ధాన్యాలను ప్రదర్శనలో ఉంచారు..ఫిబ్రవరి 16వ తేది నుంచి 27వ తేది వరకు ఆది మహోత్సవాలు జరుగుతున్నాయి..
Through Aadi Mahotsav, we get a glimpse of the greatness of our tribal communities. The Mahotsav also highlights diverse tribal products. It is a must visit… pic.twitter.com/q1X47UDKYl
— Narendra Modi (@narendramodi) February 16, 2023