గ్యాంగ్ స్టర్స్ బిల్డింగ్ ను కూల్చివేసిన యూ.పీ ప్రభుత్వం
అమరావతి: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంఘ విద్రోహ శక్తులు, నేరస్తులు, గ్యాంగ్ స్టర్స్ పట్ల కఠినంగా వ్యవహరిస్తొంది.. శుక్రవారం మనీ లాండరింగ్ దందా చేస్తూ గ్యాంగ్ స్టర్గా మారిన మావు నియోజకవర్గం ఎమ్మెల్యే అబ్బాస్ అన్సారీ చెందిన ఇంటిని, యూపీ సర్కార్ బుల్ డోజర్లతో కూల్చివేసింది.. మవు ఎమ్మెల్యే అబ్బాస్ అన్సారీ మనీలాండరింగ్ కేసులో గత మూడు నెలలుగా జైల్లో ఉన్నారు..ఆయన తండ్రి అబ్దుల్ అన్సారీ కూడా రాజకీయ నాయకుడు..మౌ జిల్లాలోని జహంగీరాబాద్లో రెండు అంతస్తుల భవనంలో వీరు నివాసం ఉంటున్నారు..ఇంటి నిర్మాణం సమయంలో స్థానిక కార్పొరేషన్ నుంచి ఎలాంటి అమనుతులు తీసుకోకుండా, అక్రమంగా భవన నిర్మాణం చేపట్టారు..ఈ విషయాన్ని గుర్తించిన మవు మునిసిపాల్ కార్పొరేషన్ కోర్టులో కేసు వేసింది.. నిబంధనలకు విరుద్దంగా బిల్డింగ్ నిర్మాణం జరిగిందని గుర్తించిన కోర్టు,,కూల్చివేయటానికి కార్పొరేషన్కు అనుమతి ఇచ్చింది..కోర్టు ఆదేశాలతో బుల్ డోజర్లతో రంగంలోకి దిగిన మునిసిపాల్ కార్పొరేషన్ సిబ్బంది,,అబ్బాస్ అన్సారీ, ఉమర్ అన్సారీలకు చెందిన బిల్డింగ్ను కూల్చివేశారు..తమ ఇంటిని కూల్చివేయటం వెనక రాజకీయ దురుద్దేశం ఉందని వాళ్లు అన్సారీ బ్రదర్స్ విమర్శలు గుప్పించారు.. ఇందులో ఎలాంటి రాజకీయ జోక్యం లేదని,,ఇంటి నిర్మాణం సమయంలో కనీసం బిల్డింగ్ మ్యాప్ కూడా కార్పొరేషన్కు చెందిన ప్లానింగ్ డిపార్ట్మెంట్కు సమర్పించలేదని కార్పొరేషన్ అధికారులు పేర్కొన్నారు..ఓ గ్యాంగ్ స్టర్ ఇంటిని బుల్ డోజర్స్ తో కూల్చివేయటంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు..క్రిమినల్స్ విషయంలో యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తీసుకుంటున్న చర్యల పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.