వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది..ఆదివారం వేకువజామున పులివెందులకు వెళ్లిన సీబీఐ బృందం భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకుంది..అరెస్ట్ తరువాత పులివెందుల నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చిన సీబీఐ, వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు..అక్కడి నుంచి నేరుగా సీబీఐ న్యాయమూర్తి నివాసానికి తరలించారు..నేటి ఉదయం నుంచి ఇప్పటి వరకూ జరిగిన పరిణామాలపై మొదటిసారిగా ఎంపీ అవినాష్ స్పందించారు.. తండ్రి అరెస్ట్ తో హైదరాబాద్ నుంచి పులివెందులకు వెళ్లిన ఎంపీ,,అక్కడే మీడియాతో మాట్లాడారు..ఈ సందర్భంగా మళ్లీ పాత విషయాలనే గుర్తుకు చేస్తు,,సీబీఐపై ఆరోపణలు చేశారు.