DISTRICTS

తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో బస్సు బోల్తా, స్వల్ప ప్రమాదం‌

తిరుపతి: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో స్వల్ప ప్రమాదం‌ చోటు చేసుకుంది..అలిపిరి డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు,,కొండ దిగుతున్న సమయంలో 28వ మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది..బస్సులో 30 మంది ప్రయాణికులు ఉండగా,, ఆరుగురికి గాయాలయ్యాయి.. అదే సమయంలో బస్సు వెనకాలే వస్తున్న టీటీడీ సిబ్బంది, కానిస్టేబుల్స్ వెంటనే స్పందించారు..బస్సు అద్దాలు పగలగొట్టి ప్రయాణికులను వెలుపలకి తీసుకొచ్చారు..వీరిని తిరుపతి  రుయా ఆసుపత్రికి తరలించి,,చికిత్స అందిస్తున్నారు..అధిక వేగానికి తోడు స్టీరింగ్ కూడా లాక్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు..పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని,,బస్సును ప్రక్కకు జరిపి ట్రాఫిక్‌ని క్రమబద్ధీకరించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *