AMARAVATHIDISTRICTS

వైసీపీ దెబ్బ‌కి రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారాలంద‌రూ ఇత‌ర రాష్ట్రాల‌కు వెళ్లిపోయార‌ు-నారాయణ

నెల్లూరు: టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో నిరుపేద‌ల కోసం రూ. 2,260 కోట్ల‌తో అత్యాధునిక షేర్‌వాల్ టెక్నాల‌జీతో నెల్లూరు న‌గ‌రంలో 42వేల టిడ్కో గృహాల‌ను నిర్మించామ‌ని,,దాదాపు నిర్మాణాలు పూర్తి చేసి పేద‌ల‌కి తాళాలు ఇచ్చే స‌మ‌యంలో ఎన్నిక‌ల కోడ్ రావ‌డంతో వాటిని ఇవ్వ‌లేక‌పోయామ‌ని మాజీ మంత్రి నారాయ‌ణ అన్నారు..ఆదివారం న‌గ‌రం 3వ డివిజ‌న్ పరిధిలో వేణుగోపాల్ నగర్ త‌దిత‌ర ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు.ఈ సందర్బంలో అయన మాట్లాడుతూ ఆ త‌రువాత వ‌చ్చిన వైసీపీ ప్ర‌భుత్వం ఐదేళ్లు అయినా నిరుపేద‌ల‌కి ఇల్లు ఇవ్వ‌క‌పోవ‌డం దారుణ‌మ‌న్నారు.. టీడీపీ వాళ్లు నిర్మించారు కాబట్టి ఇప్పుడు ఇస్తే వాళ్ల‌కి ఎక్క‌డ పేరు వ‌స్తుందోన‌ని వైసీపీ ఆలోచ‌న చేయ‌డం క‌రెక్ట్ కాద‌న్నారు.. రాజ‌కీయ‌మంటే ఇది కాద‌ని వైసీపీ నాయ‌కుల‌కి ఆయ‌న హిత‌వు ప‌లికారు. ప్ర‌జా స‌మ‌స్య‌లు తీర్చ‌డం ప్ర‌భుత్వం బాధ్య‌త అని తెలిపారు.ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు ప‌నులు ఫేజ్ వ‌న్ పూర్తయ్యాయ‌ని…టీడీపీ రాగానే వాటిని కూడా పూర్తి చేసి…నెల్లూరు న‌గ‌ర ప్ర‌జ‌ల‌కే జిల్లా వాసులంద‌రికి అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌ని హామీ ఇచ్చారు. వైసీపీ నాయ‌కులు దెబ్బ‌కి రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారాలంద‌రూ ఇత‌ర రాష్ట్రాల‌కు వెళ్లిపోయార‌న్నారు. దీంతో ప్ర‌భుత్వానికి ఆదాయం ప‌డిపోయింద‌న్నారు. ఎప్పుడైతే ప్ర‌భుత్వానికి ఆదాయం రాదో…డెవ‌ల‌ప్ మెంట్‌, సంక్షేమం రెండూ ఆగిపోతాయ‌న్నారు. అది చేయ‌లేక ప్ర‌జ‌ల మీద భారం మోపి…ట్యాక్స్ లు వేశార‌ని విమ‌ర్శించారు. ఎమ్మెల్యేగా తనను,,ఎంపీగా వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాల‌ని నారాయ‌ణ ప్ర‌జ‌ల్ని కోరారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *