కోడికత్తి కేసులో శ్రీనివాసులకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
అమరావతిం సుదీర్ఘ కాలం తరువాత ఎట్టకేలకు కోడికత్తి కేసులో శ్రీనివాసులకు రాష్ట్ర హైకోర్టులో ఊరట దొరికింది.. కోడికత్తి కేసులో నిందితుడు జనపల్లి.శ్రీనివాసరావుకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది..2018 అక్టోబరు 25వ తేదిన వైజాగ్ ఎయిర్ పోర్టులో,అప్పటి ప్రతిపక్షనేత జగన్ పై శ్రీను కోడికత్తతో దాడి చేశారు..అప్పటి నుంచి శ్రీనివాసులు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు..ఇప్పటి వరకు జగన్ తనపై జరిగిన దాడి కేసులో సాక్ష్యం చెప్పేందుకు కోర్టులో హాజరుకాకపోవడంతో,క్రింద కోర్టుల అభ్యంతరాలను పరిశీలించిన న్యాయమూర్తి,,శ్రీనివాసులకు రూ.25 వేల పూచీకత్తుతో 2ష్యూరిటీల సమర్పించాలని అదేశించింది..కేసు వివరాలకు సంబంధించి మీడియాతో మాట్లాడొద్దని,, ర్యాలీలు,, సభల్లో పాల్గొనద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.. హైకోర్టు తీర్పుపై దళిత, పౌర సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.