అభివృద్ధి చెందిన భారతదేశం, విశ్వం ముంగిట సగర్వంగా నిలుస్తుంది- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
అమరావతి: నేడు దేశ ప్రజలు చూస్తున్న విజయాలు గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధాలనలకు పొడిగింపు అని,,‘గరీబీ హఠావో’ అనే నినాదాన్ని చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం, అయితే ప్రస్తుతం మన జీవితంలో మొదటిసారిగా పేదరికాన్ని పెద్ద ఎత్తున నిర్మూలించడం చూస్తున్నామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త పార్లమెంట్ భవనంలో తొలిసారిగా ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి అన్నారు..ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని NDA-II చివరి బడ్జెట్ సెషన్ బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ప్రారంభమైంది..ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించారు.. అయోధ్యలో రామమందిరాన్ని ప్రతిష్టించడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు.. యువశక్తి,,మహిళా శక్తి,, రైతులు,, పేదలు అనే నాలుగు బలమైన స్తంభాలపై అభివృద్ధి చెందిన భారతదేశం సగర్వంగా నిలుస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.. కొత్త పార్లమెంటు భవనంలో ఇది నా మొదటి ప్రసంగం..ఈ గొప్ప భవనం అమృత కాలం ప్రారంభంలో నిర్మించడం జరిగిందని గుర్తు చేశారు.. ఇది ‘వన్ ఇండియా,, బెస్ట్ ఇండియా’ అనే సువాసనను కలిగి ఉందని,, ప్రజాస్వామ్య, పార్లమెంటరీ సంప్రదాయాలను గౌరవించాలనే సంకల్పం ఉందన్నారు..21వ శతాబ్దపు కొత్త భారతదేశానికి సంబంధించిన కొత్త సంప్రదాయాలను నిర్మించాలనే సంకల్పం ఉందని అలాగే ఈ కొత్త భవనంలో విధానాలపై అర్థవంతమైన చర్చలు జరుగుతాయని విశ్వసిస్తున్నానని రాష్ట్రపతి అన్నారు..మన రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వాతంత్ర్య వేడుకలను అమృత మహోత్సవ్ జరుపుకున్నామని,, దేశం కోసం అలుపెరుగని పోరాటం చేసిన స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకున్నమన్నారు..ఈ సందర్బంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ప్రశంసించారు..జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9వ తేది వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి..
#WATCH | Budget Session | President Droupadi Murmu arrives at the Parliament for her address to the joint session of both Houses. Sengol carried and installed in her presence. pic.twitter.com/vhWm2oHj6J
— ANI (@ANI) January 31, 2024