బాధ్యతలు చేపట్టిన కొత్త జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్
నెల్లూరు: జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న రీ సర్వే, స్వామిత్వ ,గృహ నిర్మాణాల లక్ష్యాలను సాధించడానికి చర్యలు తీసుకుంటామని నూతన జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ వెల్లడించారు. సోమవారం కలెక్టరేట్ లోని ఆయన ఛాంబర్ లో జాయింట్ కలెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అందరి సహకారంతో ప్రభుత్వం కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కృష్ణా జిల్లా నూజివీడు సబ్ కలెక్టర్ గా పనిచేసి, నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ కేరళ రాష్ట్రంలోని క్యాలికట్ కు చెందిన వారు..ఈయన 2020 IAS బ్యాచ్ చెందిన వారు. తొలుత జిల్లా కలెక్టర్ హరి నారాయణ్ ను నూతనంగా బాధ్యతలు చేపట్టిన జె.సి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కలెక్టరేట్లోని పలువురు అధికారులు,సిబ్బంది జె.సిని కలిసి అభినందనలు తెలిపారు.