విశ్వాస పరీక్షలో నెగ్గిన చంపై సోరెన్
అమరావతి: జార్ఖండ్ అసెంబ్లీలో నిర్వహించిన విశ్వాస పరీక్షలో చంపై సోరెన్ ప్రభుత్వనికి అనుకూలంగా 47 ఓట్లు,, వ్యతిరేకంగా 29 ఓట్లు పోలయ్యాయి..చంపై సోరెన్ విశ్వాస పరీక్షలో నెగ్గినట్లు జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రకటించారు..విశ్వాస పరీక్ష ముగిసిన అనంతరం అసెంబ్లీ వాయిదా పడింది..81 అసెంబ్లీ స్థానాలు ఉన్న జార్ఖండ్ లో జేఎంఎంకు 29 మంది ఎమ్మెల్యే ఉన్నారు.. కాంగ్రెస్, సీపీఎంతో కలిసి జేఎంఎం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది..జేఎంఎం మిత్రపక్షాలైన కాంగ్రెస్ కు 17, సీపీఎంకు ఒక ఎమ్మెల్యే ఉన్నారు..విపక్ష బీజేపీకి 26 మంది ఎమ్మెల్యేలతో పాటు ఆ పార్టీ మిత్రపక్షాలకు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు.. విశ్వాస పరీక్ష ఓటింగ్ లో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ పాల్గొన్నారు..